పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లు. ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కించిన ఈ సినిమా ఫైనల్ గా బిగ్ స్క్రీన్స్ మీదకి రాబోతుండగా ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం ఇపుడు అన్నీ తానై పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్రమోషన్స్ ని ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ ఎం రత్నం అస్వస్థతకు లోనయ్యారు అని కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏ ఎం రత్నం (AM Rathnam) కళ్ళు తిరిగి పడిపోయారు. ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత ఆయన ఆఫీసుకు వెళ్లగా టెన్షన్ కారణంగా హై బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారట. దీంతో సిబ్బంది అతన్ని ఒమేగా హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైద్యులు ఏ.ఎం.రత్నం హై బీపీ, హై ఫీవర్ తో బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ విషయమై అసలు క్లారిటీ బయటకు వచ్చింది. ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని రత్నం గారు ఆరోగ్యం గానే ఉన్నారు అని ఒక అధికారిక క్లారిటీ యూనిట్ సైడ్ నుంచి వచ్చింది. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.
‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న రిలీజ్ కానుంది. 5 ఏళ్ళు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ఏ.ఎం.రత్నం దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టారు. రిలీజ్ టెన్షన్ల కారణంగానే ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్టు స్పష్టమవుతుంది.